టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం  | Fraud in name of TTD jobs Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం 

Sep 11 2022 4:49 AM | Updated on Sep 11 2022 4:24 PM

Fraud in name of TTD jobs Andhra Pradesh - Sakshi

ప్రధాన నిందితుడు బాలకృష్ణ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్‌ ఏవీఎస్‌వో పద్మనాభన్‌ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు.

ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్‌ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement