స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్‌ దుర్మరణం | Female police officer Ends Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్‌ దుర్మరణం

Mar 7 2025 12:21 PM | Updated on Mar 7 2025 12:22 PM

Female police officer Ends Life In Visakhapatnam

అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్‌ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్‌(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. 

ఆమె భర్త స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్‌ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్‌ నుంచి పోర్టు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్‌ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్‌ వేశారు. 

దీంతో  వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్‌కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్‌ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.    

పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement