ఆయేషా మీరా కేసులో సాక్షుల విచారణ | Examination of witnesses in Ayesha Meera case | Sakshi
Sakshi News home page

ఆయేషా మీరా కేసులో సాక్షుల విచారణ

Sep 7 2023 3:40 AM | Updated on Sep 7 2023 3:40 AM

Examination of witnesses in Ayesha Meera case - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ఆయేషా మీరా హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నేటికీ నిందితులను పట్టుకోలేకపోవడంతో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును అనేక కోణాల్లో విచారించారు.

2019లో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించారు. అసలు నిందితుల కోసం విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆయేషా మీరా కేసును వాదించిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, తాజాగా ఆయేషా మీరా కేసులో పంచనామా నిర్వహించిన కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు సాక్షులను అధికారులు విచారించారు. కేసు విచారణలో తాము ఎప్పుడు పిలిచినా రావాల్సిందిగా అధికారులు సాక్షులకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement