AP Schools Dussehra Holidays: ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు.. ఎప్పటినుంచంటే..

Dussehra holidays for schools from 26th September in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 6వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు.

చదవండి: (అరుదైన రికార్డ్‌.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top