జగన్‌ వచ్చారు.. చెక్కులు అందాయి | Distribution of checks to 17 affected families | Sakshi
Sakshi News home page

జగన్‌ వచ్చారు.. చెక్కులు అందాయి

Aug 24 2024 5:41 AM | Updated on Aug 24 2024 5:41 AM

Distribution of checks to 17 affected families

మాజీ సీఎం పర్యటనతో ఆగమేఘాల మీద సిద్ధం చేసిన సర్కారు 

అప్పటికప్పుడు 17 బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కుల పంపిణీ  

సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి 17 మంది మృత్యువాత పడితే 24 గంటల వరకు కనీసం ఘటనా స్థలానికే వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాకతో  ఆగమేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు. 

గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్‌ జగన్‌ హెచ్చరికలతో అప్పటికప్పుడు 17 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement