Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం | Devotees Huge Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Jun 1 2024 7:49 AM | Updated on Jun 1 2024 10:27 AM

Devotees Huge Rush At Tirumala Temple

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి  24  గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు. నిన్న 67,873 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.93 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement