తండ్రి కర్మకాండలకు నిరాకరించిన కొడుకు.. నిర్వహించిన కూతురు!

Daughter who performed her father funerals - Sakshi

కొడుకు ఉన్నప్పటికీ మనస్పర్థల కారణంగా నిరాకరించిన వైనం 

వేటపాలెం: కొడుకు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తండ్రికి కర్మకాండలు చేసేందుకు నిరాకరించాడు. దీంతో కుమార్తే తన తండ్రికి కర్మకాండలు నిర్వహించింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని నాయినపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రా­మం­లోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నివాసం ఉండే సూరిశెట్టి సాంబశివరావు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కుమార్తె, కుమారుడు సంతానం కాగా, ఇద్దరికీ వివాహం చేశాడు.

కుమారుడు విజయవాడలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు బుధవారం మరణించాడు. గురువారం కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది. అయితే,  తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు నిరాకరించాడు. దీంతో మృతుడి కుమార్తె శ్రీలక్ష్మి  అంత్యక్రియలు నిర్వహించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top