ఒకే రోజు కోలుకున్న 7,866 మంది | Corona Update: Andhra Pradesh Health Bulletin | Sakshi
Sakshi News home page

ఒకే రోజు కోలుకున్న 7,866 మంది

Aug 17 2020 6:09 PM | Updated on Aug 17 2020 6:24 PM

Corona Update: Andhra Pradesh Health Bulletin - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,09,100కి పెరిగింది.

గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు  తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్‌ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి. (దేశంలో 26 లక్షలు దాటిన కరోనా కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement