
ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,09,100కి పెరిగింది.
గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి. (దేశంలో 26 లక్షలు దాటిన కరోనా కేసులు)