ఏపీ: 24 గంటల్లో 2,332 మంది డిశ్చార్జి‌‌‌

Corona In AP: New 7224 Cases Reported In A Day - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,907 మందికి పరీక్షలు చేయగా వారిలో 7,224 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. శుక్రవారం రోజు 15 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,55,455కు చేరింది. ఇప్పటి వరకు 7,388 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,332 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 9,07,598 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 40469 యాక్టివ్‌ కేసులున్నాయి.

చదవండి: గాలితోనే కరోనా అధికంగా వ్యాప్తి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top