Compassionate Appointments In AP Secretariat - Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..

Oct 28 2022 8:31 AM | Updated on Oct 28 2022 3:09 PM

Compassionate Appointments In AP Secretariat - Sakshi

పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: ప్రొబేషన్‌  సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: విశాఖపై విద్వేషాల కబ్జా 

పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్‌ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement