తుమ్మలగుంటకు సీఎం జగన్‌.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ  | Sakshi
Sakshi News home page

తుమ్మలగుంటకు సీఎం జగన్‌.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ 

Published Thu, Dec 22 2022 7:36 AM

CM YS Jagan will visit Tummalagunta Today - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తుమ్మలగుంటకు విచ్చేయనున్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి మణిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. గురువారం సాయంత్రం 5.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.40కు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకోనున్నారు.  

భద్రతా ఏర్పాట్ల పరిశీలన 
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఎంఆర్‌పల్లి సీఐ సురేంద్రరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సుధాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. లైటింగ్‌కు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ అవసరమైన జనరేటర్లు, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   

చదవండి: (వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్‌ ఖరారు)

Advertisement
Advertisement