CM Jagan Narsipatnam Tour: సీఎం జగన్‌ నర్సీపట్నం పర్యటన షెడ్యూల్‌ ఇదే..

CM YS Jagan Narsipatnam Tour Schedule Details - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శుక్రవారం(డిసెంబర్‌ 30) అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం, సీఎం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

 సీఎం జగన్‌ నర్సీపట్నం పర్యటన వివరాలు ఇవే.. 

  • ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌.
  • ఉదయం 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు.
  • ఉదయం 11.15-12.50 మధ్య జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన.
  •  తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన.
  •  అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగం. 
  • కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top