గవర్నర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌ | CM YS Jagan Meeting With Governor Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

Dec 15 2021 5:05 PM | Updated on Dec 15 2021 7:36 PM

CM YS Jagan Meeting With Governor Biswabhusan Harichandan - Sakshi

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పరామర్శించారు.

సాక్షి, విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పరామర్శించారు. బుధవారం సాయంత్రం రాజ్ భవన్‌కు చేరుకున్న సీఎం జగన్‌కి గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గవర్నర్‌ దంపతులు.. హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విజయవాడకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ దంపతులు.. గవర్నర్‌ దంపతులను కలిసి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామన్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు సూచించారు. శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విజయవాడ నగర పోలీస్ కమషనర్ కాంతి రాణా టాటా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు అక్కడ ఉన్నారు.

చదవండి: (ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement