
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు.
రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.