ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు  | CM YS Jagan Dussehra Festival wishes to Telugu States People | Sakshi
Sakshi News home page

ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు 

Oct 4 2022 4:55 AM | Updated on Oct 4 2022 2:36 PM

CM YS Jagan Dussehra Festival  wishes to Telugu States People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్‌ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  

Advertisement
 
Advertisement
Advertisement