హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

Cm Jagan Holi 2023 Wishes To Ap People - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

కాగా, దేశవ్యాప్తంగా రంగుల కేళి హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు.
చదవండి: మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్‌ ఇదే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top