ఎస్బీఐ నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రుణం
గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట వివిధ సంస్థల ద్వారా అప్పులు చేయడాన్ని చంద్రబాబు సర్కారు నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్లు టర్మ్ రుణం తీసుకునేందుకు అనుమతిస్తూ ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ హామీ రుణం మొత్తం కాలపరిమితి వరకు వర్తిస్తుంది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ చెల్లింపుల షెడ్యూల్తోపాటు వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం కాలం వంటి వివరాలను సమర్పించాలి. ఏపీపీఎఫ్సీఎల్ తన సొంత వనరుల నుండే రుణ సేవా బాధ్యతలను నిర్వహించాలి.రుణమొచ్చన సంస్థకు చెల్లించాల్సిన బాధ్యతలను తీర్చడంలో విఫలమైన సందర్భంలో మాత్రమే ఈ ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. హామీ ఇచి్చన మొత్తంపై ఐదు శాతం హామీ కమీషన్ను చెల్లించాలి.


