‘చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు’
సాక్షి, అమరావతి: అవినీతి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్సార్సీపీని బలపరుస్తున్నారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఏదీ చేసైనా సరే రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు తపన. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.