
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం కేజే పురం జంక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతోషి మాత ఆలయం అన్నదాన భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. జేసీబీ మిషన్తో సహా వచ్చిన ఆర్అండ్బీ అధికారులను అన్నదాన భవనాన్ని కూల్చవద్దంటూ భక్తులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.

అధికారులతో వాగ్విదానికి దిగారు. అన్నదాన భవనాన్ని కూల్చితే సహించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. భక్తులు, గ్రామస్తులు ఎదురు తిరగటంతో అధికారులు వెనుదిరిగారు.