సాక్షి, అమరావతి: వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్, డీఐజీ పాల్రాజ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పాల్రాజ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వాస్తవాలు నిర్ధారించుకోకుండా పోలీసు శాఖపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు రాసిన రెండోసారి రాసిన లేఖలోనూ చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేశారు. పాల్రాజ్ ఇంకా ఏమన్నారంటే..
► దేశంలో పోలీసు సిబ్బందిపై నమోదైన కేసుల్లో 41% ఏపీలోనే ఉన్నట్టు లేఖలో పేర్కొనడం విజ్ఞతకాదు. చిత్తూరు, విశాఖ సిటీ, విశాఖ రూరల్లో కేసుల డేటా తప్పుగా నమోదు కావడం వల్లే ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) లెక్కల్లో తేడాలున్నాయనే విషయాన్ని నిర్ధారించుకోకపోవడం దారుణం.
► షేక్ సత్తార్, ఆయన కుటుంబ సభ్యులు బాధితులుగా ఉన్న నాలుగు కేసుల్లో పోలీసులు తీసుకున్న చర్యలను విస్మరించడం దురదృష్టకరం.
► టీడీపీ నాయకుడు పట్టాభి కారు ధ్వంసం చేసినట్టు ఫిర్యాదు చేసిన వెంటనే విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు సంఘటనకు ముందు నుంచి మాత్రమే పనిచేయకపోవడం దురదృష్టకరం.
► డీజీపీ సవాంగ్ దేవాలయాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టించే చంద్రబాబు, పట్టాభి... మతకల్లోల డాటాను ప్రస్తావించడం ఎంతవరకు సబబు?
► గతేడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 3 శిరోముండనం కేసుల్లో... సీతానగరంలో నిందితుడు సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు తరలించారు. విశాఖ కేసులో ఏడుగురు నిందితులను, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
► ఆలయాల వద్ద 5,400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో నేరాలకు పాల్పడిన 1,093 మందిని బైండోవర్ చేశాం. ఇప్పటివరకు 29 కేసుల్లో 22 కేసులను ఛేదించడంతో పాటు 178 మంది నిందితులను అరెస్ట్ చేశాం.
► నిరసన గళాలను తొక్కి వేస్తున్నామనడం సత్యదూరం. పోలీసు శాఖ దిశ పోలీస్స్టేషన్ల ఏర్పాటు, దిశ యాప్తో సమర్థవంతమైన సేవలు అందిస్తోంది. ఇటువంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్ష నేత పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయడం సరికాదు. ఇలాంటి చర్యలు మానుకోవాలి.
పోలీసుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారు
Published Wed, Oct 7 2020 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement