టీడీపీకి సవాల్.. ఆరోపణలపై చర్చకు సిద్ధం: మంత్రి ఉషాశ్రీ చరణ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలకు ఏపీ మంత్రి ఉషాశ్రీచరణ్ బహిరంగ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలకు చర్చకు సిద్ధమంటూ శుక్రవారం ఆమె మీడియా సమక్షంలో పేర్కొన్నారు.
నాపై చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలపై పరువు నష్టం కేసు వేస్తామని ప్రకటించారామె. ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆమె.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు