ఏపీ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు విడుదల | AP LAWCET PG LAWCET 2025 Results Released | Sakshi
Sakshi News home page

ఏపీ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు విడుదల

Jun 19 2025 5:52 PM | Updated on Jun 19 2025 6:20 PM

AP LAWCET PG LAWCET 2025 Results Released

సాక్షి, తిరుపతి: ఏపీ లా సెట్, పీజీ లాసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. లాసెట్‌, పీజీ లాసెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. లా సెట్‌, పీజీ లాసెట్‌లో 20,826 మంది అర్హత సాధించారు. లాసెట్‌, పీజీ లాసెట్‌లో బాలికలదే పైచేయిగా నిలిచింది. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్‌బీతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన ఏపీ లాసెట్-2025 పరీక్షను నిర్వహించారు. 21,251 హాజరైన అభ్యర్థుల్లో 20826 మంది ఉత్తీర్ణత సాధించారు.

అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన పీజీ లాసెట్ విద్యార్థులు
1. బైసాని హరిత శ్రీ - అద్దంకి(113 మార్కులు)
2. యనమల్ల లోకేశ్వరి - వైఎస్సార్‌ కడప ( 108 మార్కులు)
3. కొర్సపాటి ప్రశాంత్ - ఒంగోలు (108 మార్కులు)

అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన  లాసెట్ ఐదేళ్ల కోర్సు విద్యార్థులు
1. పల్లపు గ్రీష్మ - అన్నమయ్య జిల్లా (107 మార్కులు)
2. సింగమల్ల భావన - తిరుపతి (107 మార్కులు)
3. బత్తుల సూర్య తేజ - నరసరావుపేట (105 మార్కులు)

అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన లాసెట్ మూడేళ్ల కోర్సు విద్యార్థులు
1. వేముల వెంకట శివ సాయి భార్గవి - అనకాపల్లి (115 మార్కులు)
2. ముదునూరి రాంతేజ్ వర్మ హ విశాఖపట్నం (113 మార్కులు)
3. పల్నాటి సత్య అంజనా దేవి - ఏలూరు(113 మార్కులు)
 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement