సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడైనా.. ఇంతటి కరోనా విపత్తులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకింత పట్టుదల కనబరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపనంత మాత్రాన స్థానిక సంస్థల స్థాయిలో ప్రస్తుతం సాగుతున్న పాలన కుంటుపడుతోందా అని నిలదీసింది. పాలన సజావుగా సాగుతున్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ (మేధావుల) ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే కరోనాకు భయపడి మూడొంతుల మంది ఓటర్లు ఓటేయడానికే రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అంత తక్కువ స్థాయి ఓటింగ్తో ఎన్నికలు నిర్వహిస్తే ‘ఫ్రీ అండ్ ఫెయిర్ (స్వేచ్ఛ, పారదర్శకం)’గా ఎన్నికల నిర్వహించినట్టా అని విజయబాబు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై నిమ్మగడ్డతో ఏ చర్చకైనా సిద్ధమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ మంచిది కాదని తమ ఫోరం తరఫున గవర్నర్కు లేఖ రాస్తామని చెప్పారు.
ప్రభుత్వంపై అక్కసు.. ప్రతిపక్షంపై ప్రేమా?
నిమ్మగడ్డ వ్యవహారశైలి ప్రభుత్వంపై అక్కసు, ప్రతిపక్షంపై అవ్యాజ్యమైన ప్రేమ చూపుతున్నట్టు ఉందని విజయబాబు విమర్శించారు. ఇందుకు ఆయన కొందరు నేతలతో స్టార్ హోటళ్లలో జరిపిన రహస్య చర్చలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు మల్లికార్జునమూర్తి, పిళ్లా రవి, సాయిరాం పాల్గొన్నారు.
ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు?
Published Tue, Dec 8 2020 5:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement