ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌.. ఉత్తర్వులు జారీ | Sakshi
Sakshi News home page

APPSC Chairman: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

Published Sat, Feb 19 2022 9:34 AM

AP Govt Issue Orders Appointing Gautam Sawang As APPSC Chairman - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
(చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్‌ సమాధానం చెప్పాలి)

Advertisement
Advertisement