ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్‌

AP Governor Biswabhusan Harichandan Approves Budget Ordinance - Sakshi

సాక్షి, అమరావతి: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. మూడు నెలల కాలానికి గాను కేబినెట్‌ దీనిని ఆమోదించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించడంతో ఆయన ఆమోద ముద్ర వేశారు.
చదవండి:
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్‌..
సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top