ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Ap Government Released Transfer Orders For IAS Officers - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో  భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉ‍న్న జె. నివాస్‌ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా వెంకటేశ్వర్, అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీగా నిశాంతి, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా హౌసింగ్‌ జేసీగా కేఎస్ విశ్వనాథన్, వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్‌ జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీగా మౌర్య, కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీగా అజయ్‌కుమార్, గుంటూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా విధే ఖారే, పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీగా సూరజ్ ధనుంజయ్, విశాఖ జిల్లా హౌసింగ్ జేసీగా కల్పనకుమారి, విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీగా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీగా హిమాన్షు కౌశిక్ , ఏపీ ఆగ్రోస్‌ ఎండీగా కృష్ణమూర్తి బదిలీ అయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top