Corona Virus: ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,065 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 138 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ఒకరు మంది మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 118 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 788 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,157 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73,390 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,07,005 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top