
కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.
సాక్షి, విజయవాడ: కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధినాలు పాటించలేదని, ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని సంజయ్ తెలిపారు.
నేరుగా ఈ డిపార్ట్మెంట్ చంద్రబాబుతో సంప్రదించేలా ప్లాన్ చేశారు. జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలున్నాయి. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా బాబు సంతకం ఉంది. సిమెన్స్ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది ఎంవోయూలో లేదు. అగ్రిమెంట్ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారు’’ అని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు.
‘‘స్కిల్ స్కామ్ లో రిమాండ్ తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పదల్చుకున్నాం. ఆ కార్పొరేషన్ ద్వారా హవాలా ద్వారా నిధులు దారి మళ్లాయి. సీమన్స్, డిజైన్ టెక్ సంస్థల ద్వారా నిధుల మళ్లింపు జరిగింది. చంద్రబాబు ప్రోద్బలంతో నే ఇది జరిగింది. ఏ 37ని ఏ1గా పెట్టడం ఏంటి అన్న ప్రశ్న హాస్యాస్పదం. గంటా సుబ్బారావుకి మూడు రకాల హోదాలు ఇచ్చారు. జే.వెంకటేశ్వర్లు అనే టీడీపీ వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్గా పెట్టారు.’’ అని సీఐడీ పేర్కొంది.
‘‘13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. నిధులు విడుదల చేయాలని కూడా చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారాలు ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ని నియామకంలో సంతకం ఉంది. డిప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలోనూ చంద్రబాబు సంతకం ఉంది. క్యాబినెట్ సమావేశం మినిట్స్లో కూడా సంతకం ఉంది. అగ్రిమెంట్ కి సంబంధీన జీవో లో 90:10 శాతం అని చెప్పినా.. ఆ అగ్రిమెంట్ లో 90 శాతం కోసం ప్రస్తావన లేదు. ఇందులో స్పష్టంగా దుర్బుద్ధి, దురుద్దేశ్యం కనిపిస్తోంది’’ అని సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు.
‘‘జీవోను తుంగలో తొక్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సీమన్స్ కంపెనీ నే స్వయంగా చెప్పింది. మేజిస్ట్రేట్ ముందే వాళ్లు స్టేట్మెంట్ ఇచ్చారు. సీమన్స్ యాజమాన్యంకి కేవలం 58 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు చెప్పారు. రూ.371 కోట్లను విడుదల చేసి నేరుగా 241 కోట్ల ను ఒక కంపెనీ కి పంపారు. 241 కోట్లను షెల్ కంపెనీలకి దారిమళ్లించారు. డిజైన్ టెక్కి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 371 కోట్లు నేరుగా పంపారు. 58 కోట్ల సాఫ్ట్వేర్ని 2700 కోట్లు కింద ఆడిటింగ్లో చూపించారు. గుజరాత్ వెళ్లి చూసి వచ్చారు. అక్కడ గ్రౌండ్ లో ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ మాత్రం సాఫ్ట్ వేర్ని ఊహించుకోమంటున్నారు. 6 చోట్ల పెట్టకముందే రూ.371 కోట్లని ప్రైవేట్ కంపెనీకి పంపారు. అధికారులు నిధులు విడుదల చేయడానికి వీలు లేదని ఫైల్లో రాసినా ఇచ్చారు’’ అని సీఐడీ తెలిపింది.
‘‘డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్ కార్ని ఈడీ, సీఐడీ గతంలోనే అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసి, రూ.32 కోట్లు ఆస్తులను అటాచ్ చేసింది. సీమన్స్ సంస్థ సీఐడీకి మెయిల్ పంపింది. మేము డబ్బు పెట్టలేదని సీమన్స్ మెయిల్ లో చెప్పింది. ఎండీ సుమన్ బోస్ షెల్ కంపెనీలతో చేతులు కలిపారు. ఆ విషయం సీమన్స్ విచారణ లో తేలింది అని సీమన్స్ సంస్థ చెప్పింది. ఏసీబీ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించాకే రిమాండ్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్ వేశాం. అధికారులు ఒత్తిడి వల్ల ఏమి రాశారో అన్నింటినీ ఆధారాలతో చూపాం. జీవోలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ని కూడా కొన్ని చోట్ల లేకుండా చేశారు. సీఎం, సి ఎస్ చెప్పడం వల్లనే నిధులు విడుదల చేశాం అని పీవీ రమేష్ గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు సంతకాలు 5 చోట్ల ఉన్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు’’ అని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.
చదవండి: ‘దొంగను పట్టుకుంటే ఎందుకు హడావిడి?’