Anantapur: Alive Man Comes Dead In Online, Viral - Sakshi
Sakshi News home page

‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది.. మేమేం చేయలేం’  

Jan 24 2022 11:19 AM | Updated on Jan 24 2022 4:12 PM

Anantapur: Alive Man Comes Dead in Online at Anantapur - Sakshi

Anantapur: రేషన్‌ కార్డులో కుమారుడి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే.. మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. హంప గ్రామానికి చెందిన దూదేకుల కుల్లాయమ్మ, మస్తాన్‌వలి మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం అనంతపురానికి వెళ్లారు.

ఇంటర్‌ చదువుతున్న కుమారుడు కుల్లాయప్ప పేరు రేషన్‌కార్డులో నమోదు చేయించుకునేందుకు వారు స్వగ్రామానికి వచ్చారు. జనన ధృవీకరణ పత్రం తీసుకుని అనంతపురం సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది. మేమేం చేయలేం’ అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్డులో పేరు నమోదు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు.   

చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement