breaking news
maddikera
-
‘మీ కుమారుడు చనిపోయినట్లు చూపుతోంది.. మేమేం చేయలేం’
Anantapur: రేషన్ కార్డులో కుమారుడి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే.. మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోందని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. హంప గ్రామానికి చెందిన దూదేకుల కుల్లాయమ్మ, మస్తాన్వలి మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం అనంతపురానికి వెళ్లారు. ఇంటర్ చదువుతున్న కుమారుడు కుల్లాయప్ప పేరు రేషన్కార్డులో నమోదు చేయించుకునేందుకు వారు స్వగ్రామానికి వచ్చారు. జనన ధృవీకరణ పత్రం తీసుకుని అనంతపురం సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది. మేమేం చేయలేం’ అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్డులో పేరు నమోదు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) -
తండ్రి మందలించాడని..
మద్దికెర: ఎం.అగ్రహారంలో తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన జయకర్ణ కుమారుడు భాస్కర్ (14) 9వ తరగతి చదువుతూ మధ్యలోనే మానేశాడు. చెడు సాహసాలు చేయవద్దని మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన కుమారుడు క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మతి చెందాడు. సమాచారం అందుకున్న మద్దికెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


