
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్ ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో అమిత్ షా పాలొ్గని ప్రసంగిస్తారని పేర్కొంది. అలాగే వైఎస్సార్జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారని తెలిపింది.