Ambedkar Jayanti 2022: రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్‌: సీఎం జగన్‌

Ambedkar Jayanti 2022: CM YS Jagan Pays Tribute To BR Ambedkar - Sakshi

సాక్షి, అమరావతి: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్‌, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

‘‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకుపైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top