‘ఆరోగ్యశ్రీ’లో డిశ్చార్జి వరకు మనదే బాధ్యత

Alla Nani Comments About Aarogyasri Medical Services - Sakshi

సేవలు సరిగాలేని ప్రైవేటు ఆస్పత్రులు జాబితా నుంచి తొలగింపు

ఆరోగ్యశాఖ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: ‘ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి డిశ్చార్జి అయ్యేవరకు అతనికి సేవలందించే విషయంలో పూర్తిబాధ్యత మనదే.  ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలి’ అని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షతో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే..

► ప్రజలకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందుతున్నాయా, లేదా అని ప్రతిరోజూ నిఘా ఉండాలి.
► ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఏ ఆస్పత్రుల్లోనైనా నాణ్యత లేకపోతే వాటిని జాబితానుంచి తొలగించాలి.
► ఏ గ్రామ సచివాలయం వద్దకు వెళ్లినా బాధితులకు ఆరోగ్యశ్రీ సేవల సమాచారం అందించాలి. జాబితాలోని ఆస్పత్రులపై ప్రత్యేక నివేదిక ఉండాలి. ఆరోగ్యమిత్రలను తక్షణమే నియమించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ ఉండాలి. ఐవీఆర్‌ఎస్‌ను మరింత అభివృద్ధి చేయాలి. 
► ఇప్పటివరకు ఆరోగ్య ఆసరాకు రూ.145 కోట్లు వ్యయం అయింది. 2.50 లక్షల మంది లబ్ధిపొందారు. 
► వైకల్యం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి అదేరోజు ఇవ్వాలి. వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుకోకూడదు. కరోనా రెండోదశను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
► వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వంటి దోమకాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top