Teacher Eligibility Test: టెట్‌–2021 విధానం, సిలబస్‌ ఖరారు

Adimulapu Suresh was released TET-2021 policy, syllabus finalized - Sakshi

విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను ‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌’లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

టెట్‌లో రెండు పేపర్లు..
► టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి. పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. 
► రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏలో అర్హత సాధించాలి.
► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి.
► రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2–బీలో అర్హత తప్పనిసరి. 

ఆయా పేపర్ల పరీక్ష విధానం ఇలా..
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top