చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్పై వాదనలు విననుంది.
చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్హౌజ్గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.
సంబంధిత వార్తలు