కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 200 మంది..   | 200 people from TDP to YSRCP in Kuppam Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 200 మంది..  

Sep 13 2022 5:46 AM | Updated on Sep 13 2022 5:46 AM

200 people from TDP to YSRCP in Kuppam Andhra Pradesh - Sakshi

గుర్తింపు కార్డులు చూపుతూ వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న టీడీపీ కార్యకర్తలు

కుప్పం రూరల్‌(చిత్తూరు): కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్‌ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

వీరంతా శాంతిపురం మండలం కడపల్లి, కర్లగట్ట, ప్రీతిశ్యామనూరు, మొరసనపల్లి, 7వ మైలు, గుడుపల్లె మండలానికి చెందిన ఆరు పంచాయతీల్లోని టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు. వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహా్వనించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement