బొమ్మనహాళ్: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తుంగభద్ర జలాశయం నిండకపోవడంతో నీరు ఎక్కువ అవసరమయ్యే వరి, మిరప వంటి పంటలు సాగు చేయవద్దని, తాగు నీటికే తొలి ప్రాధాన్యమని అధికారులు ప్రకటించారు. అయితే అంతకుముందే నారు మడులు సిద్ధం చేసుకున్న కొందరు రైతులు బోరుబావుల కింద నాట్లు వేశారు. ఆ నీరు సరిపోకపోవడంతో పైర్లు కుళ్లిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక గొర్రెలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామం వద్ద ఓ రైతు నారుకు నీరు అందకపోవడంతో గొర్రెలకు వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


