● తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష శిబిరాన్ని త్వరగా ఎత్తేయాలని పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చితంబరరెడ్డితో పాటు మరికొందరు నాయకులు దీక్షలకు రాకుండా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకుల రిలే దీక్షలను అడ్డుకోవాలని ‘పచ్చ’మూక ప్రయత్నించింది. దీక్షా శిబిరం వైపు రాకుండా వారిని పోలీసులు నిలువరించడంతో ‘ఇంటింటికీ టీడీపీ’ పేరుతో హంగామా చేసుకుంటూ వెళ్లారు.


