మార్చి, ఏప్రిల్, మే, జూన్... ఈ నాలుగు నెలలు వాటిని రక్షించుకోవడం రైతులు, కాపర్లకు సవాల్గా మారింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం వేసవి గండం నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టడం లేదు. పశుసంవర్ధకశాఖ కూడా మౌనంగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాయితీతో సైలేజ్ గడ్డి లేదు. దాణామృతం (టీఎంఆర్) ఇవ్వడం లేదు. పశుదాణా (కాన్సట్రేటెడ్ క్యాటిల్ ఫీడ్).ఊసే లేదు. ఎండుగడ్డి పంపిణీ అవకాశమే కనిపించడం లేదు. కనీసం గడ్డి విత్తనాలు ఇస్తామన్న ఆలోచన కూడా చేయకపోవడంపై ‘వేసవి గండం’ నుంచి గటెక్కేదెలా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. పాడి ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. జీవాలు ఇతర ప్రాంతాలకు మేత కోసం వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. పరిస్థితి విషమించాక చివర్లో కంటితుడుపు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదని రైతులు, కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


