వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి దుర్మరణం

Feb 11 2026 7:31 AM | Updated on Feb 11 2026 7:31 AM

వ్యక్తి దుర్మరణం

వ్యక్తి దుర్మరణం

కనగానపల్లి: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురానికి చెందిన మహేష్‌ (32).. రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన రాధమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్లుగా మరూరులోనే నివాసముంటూ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం రాత్రి మరూరు నుంచి కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన మహేష్‌.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement