
‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం
విలేకరులపై దాడులు సరికాదు
ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిని పత్రికా లోకం తీవ్రంగా ఖండిస్తోంది. ఎమ్మెల్యే దగ్గరుండి ఇలాంటి దాడులు చేయించడం మంచి పద్దతి కాదు. ఇలాంటి వారిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మన జిల్లాలోనూ పత్రికా విలేకరులపై దాడులు చేస్తున్నారు. బూతులు తిడుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ముఖ్యమైన టీడీపీ నాయకులే ఇలా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలసి విన్నవించాం. దాడులు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం.
– రాచమల్లు భోగేశ్వరరెడ్డి,
ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు

‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం