పాయకరావుపేట: పట్టణంలో గల రాజుగారిబీడులో ఆదివారం రాత్రి 88 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. రాజుగారిబీడుకు చెందిన రామోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి తిరిగి 10 వ తేదీన సోమవారం ఇంటికి వచ్చారు. ఇంటి మెయిన్గేటు, ఇంటి లోపల తలుపులు తెరిచి ఉండి, బెడ్రూమ్లో వున్న బీరువా తాళాలు పగులగొట్టి 88 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇంటి వరండాలో ఉన్న యాక్టివా మోటారు బైక్ను కూడా దుండగులు ఎత్తుకుపోయారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


