గ్రంథాలయ పనివేళల మార్పునకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ పనివేళల మార్పునకు ప్రతిపాదనలు

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

చైర్మన్‌ సతీష్‌ కుమార్‌

రోలుగుంట: ప్రస్తుతం అమలులో ఉన్న గ్రంథాలయ పని వేళల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ వి.సతీష్‌ కుమార్‌ తెలిపారు. పాఠకులకు అను కూలంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రంథాలయాలు పని చేయడానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఉమ్మడి విశాఖలో 67 గ్రంథాలయాలకు 142 మంది సిబ్బంది అవసరం కాగా 42 మంది మాత్రమే ఉన్నారని, ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరామన్నారు. అనకాపల్లి జిల్లా రూ.35 కోట్లు, అల్లూరి జిల్లా రూ.80 కోట్లు, జీవీఎంసి రూ.250 కోట్లు సెస్‌ బకాయిలు విడుదల చేయాలని ఆయా జిల్లాల డీపీవోలకు వినతిపత్రం పంపామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement