యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో మాజీ ప్రభుత్వ విప్, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోదెపు గోవింద్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఎంపీపీ కోన సంధ్యలచ్చన్నాయుడు, కోజెడ్పీటీసీ నర్మాల కుమార్ , ఉమ్మిడి జగన్, యువజన విభాగం నాయకులు సియ్యాద్రి బుజ్జి, కారుకుండి శ్రీను, మాసవరపు శివ, మేరుగు రాజేష్, గంగిరెడ్డి రోహిత్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.


