గవర్నర్‌ విందుకు క్రీడాకారుడు చరణ్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ విందుకు క్రీడాకారుడు చరణ్‌కు ఆహ్వానం

Aug 14 2025 7:00 AM | Updated on Aug 14 2025 7:00 AM

గవర్నర్‌ విందుకు క్రీడాకారుడు చరణ్‌కు ఆహ్వానం

గవర్నర్‌ విందుకు క్రీడాకారుడు చరణ్‌కు ఆహ్వానం

కూర్మన్నపాలెం: వాలీబాల్‌ క్రీడాకారుడు అట్టాడ చరణ్‌కు గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వడ్లపూడిలోని కణితి కాలనీలో నివాసముంటున్న చరణ్‌కు శ్రీకాకుళం కలెక్టర్‌ ద్వారా రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం గవర్నర్‌ బంగ్లాలో ప్రముఖులకు ఇచ్చే విందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. చరణ్‌ తన మేనమామల వద్ద ఉంటూ.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ వాలీబాల్‌ పోటీల్లో చరణ్‌ కాంస్య పతకం సాధించాడు. గవర్నర్‌ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో చరణ్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement