మన్యంలో ఆదివారం విభిన్నమైన, రమణీయమైన వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల వరకు చినుకుల జల్లులు కురవగా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాడేరు ఘాట్రోడ్డును దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఘాట్ రోడ్డులో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆకాశం ధగధగలాడే బంగారు వర్ణాన్ని సంతరించుకుని చూపురులను ఆకట్టుకుంది. ఒకే రోజున భిన్నమైన శీతోష్ణస్థితి, ప్రకృతి అందాలు కంటికి విందు చేయడంతో స్థానికులు, పర్యాటకులు ఎంతో మురిసిపోయారు.
– సాక్షి, పాడేరు


