కోటవురట్ల: మండల కేంద్రంలోని రెండు ఆలయాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారున ఉన్న మరిడిమాంబ, నూకాంబిక ఆలయాలలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీలు పగలగొట్టి అందులోని నగదు, కానుకలను దొంగిలించుకుపోయారు. ఉదయం ఆలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆలయాలకు చేరుకుని పరిశీలించారు. రెండు ఆలయాలలో సుమారు రూ.30 వేలు నగదు, కానుకలు అపహరణకు గురైనట్టు భావిస్తున్నారు.
పగలగొట్టిన ఆలయం తలుపుల తాళం
దుండగులు పగలగొట్టిన హుండీ


