అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


