● నాలుగు వేలు వెదజల్లిన అటవీశాఖ
చింతపల్లి: లోతుగెడ్డ రేంజ్ పరిధిలో సామాజిక అడవుల పెంపకానికి డ్రోన్ ద్వారా విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డీఎఫ్వో నరసింహారావు ఆదేశాల మేరకు గురువారం చెరుకుంపాకలు, లోతుగెడ్డ బీట్ అటవీ ప్రాంతాల్లో వెదురు, కానుగ, చింత తదితర మొక్కల 4 వేల విత్తన బంతులను డ్రోన్ ద్వారా వెదజల్లారు. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో అప్పారావు, ఎఫ్బీవో లక్ష్మీనారాయణ, ఏబీవో విజయనాగరత్నం, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


