విజృంభిస్తున్న శీతల గాలులు
● స్ధిరంగా కనిష్ట ఉష్ణోగ్రతలు
● జి.మాడుగులలో 5.1 డిగ్రీల నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు స్థానికులు ఇ బ్బందులు పడుతున్నారు. శనివారం జి.మాడుగుల లో 5.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతులు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధిలో చింతపల్లి 8.2 డిగ్రీలు, పెదబయలులో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.9 డిగ్రీలు, అరకువ్యాలీలో 10 డిగ్రీలు, హుకుంపేటలో 10.7 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.5 డిగ్రీలు, అడ్డతీగలలో 14.5 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.7 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపారు.
● వారం రోజులగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. సాయంత్రం మూడు గంటల నుంచి వీటి ప్రభావం ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 10 గంటలు దాటే వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


